తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డితో సహా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,మండలి పక్ష నేత షబ్బీర్ అలీ కూడా దేశ రాజధాని మహానగరం ఢిల్లీకు
బయలుదేరారు .
అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీ అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు.అయితే తను ఇప్పుడు కలవలేనని తేల్చి చెప్పారు .దీంతో ఆయన చేసేది ఏమి లేక హైదరాబాద్ కు తిరుగుప్రయాణం అయ్యారు .
అయితే ఇటివల కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గొడవలు జరుగుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక రేంజ్ లో ఉత్తమ్ పనితీరుపై విరుచుకుపడుతున్న సంగతి కూడా తెల్సిందే .అయితే త్వరలోనే ఉత్తమ్ ను పార్టీ అధ్యక్షా పదవి నుండి తప్పిస్తారు .అందుకే రాహుల్ గాంధీ అప్పాయింట్మెంట్ ఇవ్వలేదని ఢిల్లీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..