Home / POLITICS / బాబు ర‌హ‌స్యాలు బ‌ట్ట‌బ‌య‌లు..మోత్కుప‌ల్లిపై స‌స్పెన్ష‌న్ వేటు

బాబు ర‌హ‌స్యాలు బ‌ట్ట‌బ‌య‌లు..మోత్కుప‌ల్లిపై స‌స్పెన్ష‌న్ వేటు

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడేవారిని, త‌న కుట్ర‌లు, వ‌క్ర‌బుద్ధిని బ‌య‌ట‌పెట్టే వారిపై క‌త్తిగ‌ట్టే చంద్ర‌బాబు మ‌రోమారు అదే త‌ర‌హాలో ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌న కుట్ర‌ల‌ను బ‌య‌ట‌పెట్టినందుకు, అక్ర‌మాల‌కు వెల్ల‌డించినందుకు టీడీపీ సీనియర్ నేత‌, పార్టీ ఆవిర్భావం నుంచి ప‌నిచేస్తున్న నాయ‌కుడు మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై వేటు వేశారు.టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా  ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మోత్కుప‌ల్లి రాజకీయ కుట్రలకు ఎన్టీఆర్ బలయ్యారని తెలిపారు. తనకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని గుర్తుచేసుకున్నారు. రాజ్యాధికారం కోసం పిల్లనిచ్చిన మామని చంపావు అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

ఇంతేకాకుండా నందమూరి వంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టార‌ని, దగ్గుబాటి కుటుంబాన్ని, నందమూరి హరికృష్ణను చంద్రబాబు వాడుకొని వదిలేశారని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబే కారణమన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టే కుట్రను చంద్రబాబు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పెద్ద నటచక్రవర్తి. మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారని విమర్శించారు. త‌న బండారం బ‌య‌ట‌పెట్టిన మోత్కుప‌ల్లిపై బాబు ఆగ్ర‌హం చేశార‌ని స‌మాచారం. అందుకే ఆయ‌న‌పై వేటు వేశారు.

విజయవాడలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణతో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేయించిన చంద్ర‌బాబు మోత్కుప‌ల్లిపై వేటు వేయించారు. `మోత్కుపల్లి విపరీత ధోరణి లో ప్రవర్తిస్తున్నాడు. మోత్కుపల్లికి గవర్నర్ రాదని తెలిసి గొడవ మొదలు పెట్టాడు. మోత్కుపల్లి ద్రోహానికి క్షమాపణ లేదు. మోత్కుపల్లి ని పార్టీ నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం“ అంటూ ప్ర‌క‌టించారు. కాగా, త‌న బండారం బ‌య‌ట‌ప‌డటంతో బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat