Home / SLIDER / 2019 ఎన్నికలు… వేగం పెంచిన తెలంగాణ బీజేపీ..!!

2019 ఎన్నికలు… వేగం పెంచిన తెలంగాణ బీజేపీ..!!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీ తమ వేగాన్ని పెంచాయి.వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ని గెలిపించాలని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపి పార్టీ తమ వేగాన్ని పెంచింది.రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసిన బీజేపీ..కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా పరివర్తన యాత్ర పేరుతో కార్యాచరణ చేపట్టనుంది.

దశల వారీగా ఈ యాత్ర చేపట్టి..రాష్ట్ర ప్రజలను చైతన్యం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో నెలలో ఒకరోజు దళితవాడల్లో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు . రానున్న పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటి… 2019 శాసనసభ ఎన్నికల విజయానికి మార్గం సుగమం చేసుకుంటామని ఈ సందర్భంగా అయన స్పష్టం చేశారు.ప్రస్తుత రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ పరిపాలనపై ఛార్జిషీట్ రూపొందించి… రాష్ట్ర ప్రజల్లో చర్చకు పెడతామని అయన తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat