వర్షాకాలం వచ్చేసింది..దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.అయితే ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు..మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కేరళా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు కోస్టల్ కర్నాటక, దక్షిణ కర్నాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాల విస్తరించాయి. ఈ క్రమంలోనే వచ్చేనెల 3 నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
అయితే ముందస్తు అంచనా ప్రకారం .. జూన్ 9వ తేదీకి తెలంగాణలోకి నైరుతి ప్రవేశించొచ్చని భావించారు. అయితే రుతుపవనాల రాకకు వాతావరణం అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు . జూన్ 3వ తేదీ నుంచే తెలంగాణలో రుతుపవనాల ప్రభావం మొదలవుతుందని.. వర్షాలు పడతాయని వారు ప్రకటించారు .అయితే ఈ సంవత్సరం సాధారణ వర్షాపాతం నమోదు అవుతుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే..