ప్రస్తుతం ఏపీ లోని అధికార తెలుగుదేశంపార్టీ మళ్ళీ సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు తూట్లు పొడుస్తోంది. ఏదేని విషయమై సామాన్యులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు.. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే చాలు ఆగమేఘాల మీద కేసులు నమోదు చేసేస్తున్నారు. అలాగే, సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నవారినే బాబు ప్రభుత్వం టార్గెట్ చేసింది . ఇంతకుముందు ఇంటూరి రవి కిరణ్,ఇప్పాల రవీంద్ర ,,రాజేష్ తోట ,కొర్రిపాటి వెంకటేష్, తిరుపతి రెడ్డి , కమతం కృష్ణారెడ్డి , ఇంకా కొంతమంది మీద కేసులు పెట్టిన విషయం తెలిసిందే.
తాజాగా.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన జి. శ్రీనివాస్రెడ్డి వైఎస్సార్ సానుభూతిపరుడిగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఈయనకు ఫేస్బుక్లో కొన్ని వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు.టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా ఎండగడుతూ ఉంటారు. దీంతో ఆయన్ను టార్గెట్ చేసిన టీడీపీ నేతలు..కావాలనే తమ కార్యకర్త ద్వారా కృష్ణాజిల్లా గుడివాడలో ఫిర్యాదు చేయించారు. శ్రీనివాసరెడ్డి ఓ జాతిని కించపరిచేలా పోస్ట్ చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీంతో గుడివాడ పోలీసులు శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేశారు.