Home / SLIDER / తెలంగాణ వైద్య చరిత్రలో ఒక మైలురాయి..!!

తెలంగాణ వైద్య చరిత్రలో ఒక మైలురాయి..!!

ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నారాయణగూడలో ఐపీఎం క్యాంపస్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్‌ను మంత్రులు కేటీఆర్, లకా్ష్మరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూఈ రోజు తెలంగాణ వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అన్నారు.ప్రభుత్వ వైద్యశాలల మీద ప్రజలకు నమ్మకం పెంచుతున్నామ‌ని, పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు అందించడమే లక్ష్యంగా డయాగ్నోస్టిక్స్ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు పరీక్ష కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. గతం లో ప్రభుత్వ దవాఖానా ల మీద ప్రజలకి నమ్మకం ఉండేది కాదు అప్పటి పరిస్థితుల్లో గణనీయమైన మార్పు తెచ్చామ‌ని చెప్పారు. జిల్లా దవాఖానాల్లో ఎక్కడికక్కడ అన్ని రకాల స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇస్తున్నామ‌న్నారు. తెలంగాణ డయాజ్ఞస్టిక్స్ అనేది గర్వించాల్సిన విషయం అన్నారు. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా మ‌ని వివ‌రించారు.

బస్తి దవాఖానాల కు కూడా తెలంగాణ డియాగ్నోస్టిక్స్ సేవలను అందిస్తామ‌ని, బస్తీల్లో వుండే పేద ప్రజలకి బస్తి దవాఖానాలు ఉపయోగ పడుతున్నాయని చెప్పారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అనేక రకాల వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చని, పెయిన్ కిల్లర్స్ ని ఇష్టం వచ్చినట్టు వాడటం వల్ల కిడ్నీలు దెబ్బ తింటున్నాయని మంత్రి తెలిపారు. మందుల వాడకం పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నామని, హెల్త్ ప్రొఫైల్ ని కూడా సిద్హం చేస్తున్నామ‌ని మంత్రి వివ‌రించారు. సీఎం కెసిఆర్ స‌హ‌కారం, దిశానిర్దేశం వ‌ల్లే ఇదంతా సాధ్య‌మ‌వుతున్న‌ద‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat