ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున జోగి రమేష్ బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమాపై ఓడిపొయారు.ఈ ఎన్నికల్లో నియోజకవర్గంలోని కమ్మసామాజిక వర్గానికి చెందిన ఓట్లు అన్నీ టీడీపీ అభ్యర్థికి పడ్డాయి.
అయితే ప్రస్తుతం టీడీపీ నుండి వైసీపీలో చేరిన వసంత కృష్ణాప్రసాద్ తో ఆ పార్టీకి ప్రస్తుతం బలం పెరిగిందని రాజకీయ వర్గాలు ,విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో వైసీపీకి సపోర్టు చేసిన బీసీ సామాజికవర్గం ఓట్లతో పాటుగా గత ఎన్నికల్లో దూరమైన కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఈ సారి వైసీపీ అభ్యర్థికే పడ్తాయి అని అందరూ అంటున్నారు.
అంతే కాకుండా ఇటీవల వసంత ముస్లీం సామాజికవర్గాన్ని తనవైపు తిప్పుకోవడానికి కొండపల్లి మసీదుకు రూ.పది లక్షల రూపాయలను విరాళంగా కూడా ఇచ్చారు.అంతే కాకుండా తన తండ్రి వసంత నాగేశ్వరరావుతో సత్సంబధాలున్న నేతలతో,కార్యకర్తలతో పరిచయాలుండటం రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు..