ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్దంగా ఉన్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటుకు జమిలి ఎన్నికలు జరిగినా, విడివిడిగా ఎన్నికలు జరిగినా బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో కోరుట్ల, మల్లాపూర్ మండలాల టిఆర్ఎస్ పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కవిత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వెంట నడుస్తానని పార్టీని పటిష్టం చేస్తామని సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అమరవీరులకు నివాళి గా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం కోసం కేసిఆర్ ఎన్నో అవమానాలు, తిట్లను భరించి లక్ష్యాన్ని సాధించారు అని చెప్పారు. పదిహేనేళ్ల స్వరాష్ట్ర ఉద్యమ నాయకులు కేసీఆర్ వల్లనే తెలంగాణ బాగు పడుతుందని ప్రజలు అధికారాన్ని అప్పగించారని తెలిపారు. రేపటి తెలంగాణ బిడ్డల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఆ పనులను కొనసాగించడానికి పార్టీ పటిష్టంగా ఉండాలని అప్పుడే మన బంగారు తెలంగాణ సాకారం అవుతుందని వివరించారు. కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న వారిని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని ఆన్నారు. ముచ్చట్లు కాదు కావాల్సింది పని.. కార్యకర్తలు ఆ పని చేయాలని కార్యసాధకుడు అయిన కేసిఆర్ కు వెన్నంటి ఉండాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు.
నాలుగేళ్లలో నాలుగు వందల పైచిలుకు కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని ఒక్క వ్యవసాయం మృతి తీసుకుంటే 10 పథకాలను వ్యవసాయానికి అనుసంధానమై ఉండటాన్ని గమనించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అంగన్వాడీల్లో, మధ్యాహ్న భోజనం గతంలో కొలత పెట్టీ పెట్టేవారు.. ఇప్పుడా పరిస్థితి లేదు. సన్న బియ్యం అన్నాన్ని ఎంత కావాలంటే అంత పెడుతున్నారని వివరించారు. చేసిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలదే ఆన్నారు.కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 ప్రకటన చేసి 23న వాపస్ తీసుకున్న విషయాన్ని తెలంగాణ ఉద్యమకారులు అందరికి తెలుసు అన్నారు. ప్రపంచంలో ఎన్నో పార్టీలు ఉన్నాయని లక్ష్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని నాయకుడు ఒక్క కెసిఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. పదవులు ముఖ్యం కాదని పార్టీ బాగుంటే పదవులు వాటంతట అవే వస్తాయి అన్న విషయాన్ని కార్యకర్తలు గుర్తుంచుకోవాలని ఉద్భోదించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు రక్షణ అన్నారు. పార్టీకి మేమందరం కార్యకర్తలమని ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ నాయకుడు సైతం పార్టీ కి మొదటి కార్యకర్త అన్న విషయాన్ని మరువరాదన్నారు.
Addressed booth committee meeting along with MLA Vidyasagar Rao garu in korutla, Jagtial district. pic.twitter.com/tWLEVDBQXI
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 11, 2018