టాలీవుడ్ లో ఆనాటి అలనాటి సావిత్రి జీవిత కథ ఆదారంగా తీసిన తొలి బయోపిక్ చిత్రం మహానటి సినిమా ఏంత ఘన విజయం సాధించిందో మనకు తేలిసిందే. తెలుగు ప్రేక్షకులను బాగా ఈ సినిమా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మరి కొన్ని బయోపిక్స్ రూపొందించడానికి టాలీవుడ్ నిర్మాతలు రంగం సిద్దం చేస్తున్నారు. తాజాగా ప్రకారం రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో రాజుగాడు అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంజనా రెడ్డి త్వరలో తెలుగు రాష్ట్రానికి చెందిన రెజ్లర్ కరణం మల్లేశ్వరి బయోపిక్ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తికాగా,ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారట. బాలీవుడ్కి చెందిన బడా ప్రొడక్షన్ సంస్థ ఈప్రాజెక్ట్ని నిర్మించనుందని సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది. కరణం మల్లీశ్వరి ఒలంపిక్స్లో పతకం సాధించిన తొలి ఇండియన్ మహిళ అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవిత నేపథ్యంలో ఓ చిత్రంతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ , కాంతారావు బయోపిక్, కేసీఆర్ బయోపిక్లు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. ఈ చిత్రాలు మంచి విజయం సాధిస్తాయని అభిమానులు భావిస్తున్నారు.
