Home / POLITICS / అంబేద్కర్ ఆశయాల మేరకే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు..!!

అంబేద్కర్ ఆశయాల మేరకే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు..!!

ళితులను దాడుల నుంచి రక్షించే అత్యాచార నిరోధక చట్టంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. అత్యాచార నిరోధక చట్టంలో దళితులకు ఉన్న రక్షణలు లేకుండా చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని, దీంతో అనేక మంది దళితులు రోడ్డెక్కారని, చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీం తీర్పుపై అప్పీల్ కు వెళ్తే కేంద్రం ఇచ్చిన గణాంకాల ఆధారంగానే తీర్పు ఇచ్చినట్లు సుప్రీం కోర్టు పేర్కొందని, ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ(పీఓఏ) చట్టాన్ని పరిరక్షించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనికి పూర్తిగా మద్దతు ఇస్తోందని తెలిపారు. ఆర్టీసి కళ్యాణ మండపంలో జరిగిన ఆంధ్రాబ్యాంక్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ ఆలిండియా జనరల్ బాడీ మీటింగ్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఇన్నేళ్ల స్వాతంత్ర్యం తర్వాత, దళితులు ఎదుగుతున్నా కూడా వారిపై దాడులు మాత్రం ఆగడం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వారికున్న రక్షణలు కూడా తగ్గించే ప్రయత్నం జరుగుతోందన్నారు. పీఓఏ చట్టం దుర్వినియోగం అవుతుందన్న నెపంతో ముందస్తు అరెస్టులు అవసరం లేదని చెప్పడం దురదృష్టకరమన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని, పీఓఏ చట్టాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ దేశంలోని పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికుందని, వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు.
డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే నేడు దళితులకు రిజర్వేషన్లు లభిస్తున్నాయని, అంబేద్కర్ మహానీయుని చలవ వల్లే నేడు కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని ఉద్వేగంతో చెప్పారు. 70 ఏళ్ల క్రితమే రానున్న సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలను రాజ్యాగంలో పొందుపర్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటం తర్వాత అంబేద్కర్ రాసిన ఆర్టికల్ మూడు వల్లే రాష్ట్రం సాకారమైందన్నారు. రాష్ట్రాలు విభజన కావచ్చు, విలీనం కావచ్చని రాజ్యాంగంలో చెప్పడం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా పాలన అందిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అందరికీ విద్యనందించాలన్న అంబేద్కర్ ఆలోచనల నుంచే తెలంగాణలో గత నాలుగేళ్లలో 570 గురుకులాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ గురుకులాల వల్ల నేడు దళిత విద్యార్థులు అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారని చెప్పారు. రానున్న ఐదు, పది సంవత్సరాల్లో కార్పోరేట్ విద్యార్థులకు దీటుగా ఈ గురుకుల విద్యార్థులుంటారని అన్నారు.
1971లో పేదలకు బ్యాంకులు చేరువ కావాలనే లక్ష్యంతో బ్యాంకుల జాతీయీకరణ జరిగిందని, అయితే ఆ లక్ష్యం నేడు నెరవేరడం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వాపోయారు. బ్యాంకులకు పేదవాడు రుణం కోసం వెళ్తే చాలా సమస్యలున్నాయని, అదే నీరవ్ మోడీలు, విజయ్ మాల్యాలు వెళ్తే రెడ్ కార్పెట్ వేసి రుణాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మోడీలు, మాల్యాలు లక్షల కోట్లు ఎగ్గొట్టారని అన్నారు. బ్యాంకుల వైఖరి వల్ల పేదవాళ్ల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ధిక సహాకార పథకాలు కూడా అమలుకు నోచుకోవడం లేదన్నారు. బ్యాంకులు పేదవాళ్లకు చేరువ కావాలని, ఈ పనిని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కె. రాములు, ఆంధ్రాబ్యాంక్ ఎస్సీ, ఎస్టీ వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధులు, ఐజీ గుగులోతు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat