Home / ANDHRAPRADESH / వైఎస్ జగన్ కు కాపు నేత‌లు భారీ సన్మానం..టీడీపీ…జనసేన గుండెళ్లో రైళ్లు

వైఎస్ జగన్ కు కాపు నేత‌లు భారీ సన్మానం..టీడీపీ…జనసేన గుండెళ్లో రైళ్లు

చంద్రబాబులా గాలి మాటలు నేను చెప్పలేనని చెప్పడం మోసమా.. అని ఎల్లో మీడియాను, చంద్రబాబుని, చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని ఆరాట పడుతున్న పెద్ద నేతలను అడుగుతున్నాను. ఇదే బాబు కాపులకు అయిదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.1,340 కోట్లే. ఇది మోసం కాదా? ఈ పెద్దమనిషి ఇలా మోసం చేస్తే, నేను.. జగన్‌ అనే నేను.. అధికారంలోకి రాగానే రూ.5 వేల కోట్లను రూ.10 వేల కోట్లకు పెంచుతానని చెప్పడం మోసమా? అంటూ ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జగన్ చేసిన వాగ్దనాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం అమలు చేయలేని 600 అపద్దపు హామీలు ఇచ్చి..నేడు టీడీపీ పార్టీపై తీవ్ర వ్యతీరేకత తెచ్చుకున్నారు. కనుక నేను అమలు చేయలేని హామీలు ఇవ్వను కాని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా అనడంతో వైసీపీ బలం మరింత పెరిగిందని వైసీపీ నేతలు అంటునారు. అంతేకాదు పిఠాపురంలో ఈరోజు ఉద‌యం వైఎస్ జగన్ భారీ స‌న్మానం చేశారు. రెండు అంశాల్లో స్ప‌ష్ట‌త ఇచ్చినందుకు జ‌గ‌న్ కు స‌న్మానం చేసిన‌ట్లు పిఠాపురంలోని కాపు నేత‌లు చెబుతున్నారు. మొద‌టిదేమో కాపు కార్పొరేష‌న్ కు రూ. 10 వేల కోట్ల నిధులు కేటాయిస్తాన‌ని హామీ ఇచ్చినందుకు. ఇక రెండోదేమో బిసిల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌లిగించ‌ని కాపుల రిజ‌ర్వేష‌న్ల‌కు తాను మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించినందుకు కాపు నేత‌లు జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డారు. జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం నుండి జ‌గ‌న్ పాద‌యాత్ర‌ పిఠాపురంకు చేరుకోగానే ప‌లువురు కాపు యువకులు పెద్ద ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ జ‌గ‌న్ కు త‌మ మ‌ద్ద‌తు ప‌లికారు. కాపు కార్పొరేష‌న్ కు రూ. 10 వేల కోట్ల నిధుల కేటాయింపుపై హామీ ఇచ్చినందుకు ధ‌న్య‌వాదులంటూ ప్ల కార్డులు ప్ర‌ద‌ర్శించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat