క్యాస్టింగ్ కౌచ్ పేరిట పెను సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి అతి తక్కువ కాలంలో మోస్ట్ పాపులర్ యాక్టర్ అయింది. అప్పటి వరకు శ్రీరెడ్డి ఎవరో తెలియని వారు సైతం.. శ్రీరెడ్డి గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. అప్పటి వరకు ఏదో ఒక విధంగా మీడియాలో ప్రసారం అవుతున్న మొన్నటి వరకు హీరో నానిని టార్గెట్ చేస్తూ వచ్చింది. అంతకు ముందు టాలీవుడ్ బఢా ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ సినిమాల్లో అవకాశాల పేరుతో తనను శారీరకంగా వాడుకున్నారని, అందుకు తన వద్ద ఉన్న ఆధారాలను సైతం మీడియా వేదికగా లీక్ చేసింది. ఈ నేపథ్యంలోనే అభిరామ్, శ్రీరెడ్డి ఫోటోలో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లకు సంబంధించి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, తాను ఆరోపిస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగా పోస్టులను కూడా పెడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియా వేదికగా మరో ఫోటోను పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఆ ఫోటోపై పవన్ కళ్యాన్ ముగ్గురు భార్యల ఫోటోలతోపాటు, పూనమ్ కౌర్, పార్వతీ మెల్టన్, శ్రీరెడ్డి ఫోటోలు ఉన్నాయి. శ్రీరెడ్డి అంతటితో ఆగకుండా.. తెలుగంటి ఆడ బిడ్డలారా.. ఇతను మనకు అవసరమా..? అంటూ ప్రశ్నను కూడా సంధించింది. శ్రీరెడ్డి పోస్ట్ చేసిన ఆ ఫోటో మీ కోసం..
Publiée par Sri Reddy sur Mardi 7 août 2018