తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఇవాళ హైదరాబాద్ నగరం పరిధిలోని రామచంద్రాపురం మండలంలో ఆకస్మిక తనిఖీ చేశారు. కొల్లూరులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ‘హై రైజ్ మోడల్ టౌన్ షిప్’ డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు కీలక ఆదేశాలు ,సూచనలు చేశారు.వీలైనంత త్వరగా డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కొల్లూరు నిర్మిస్తున్న ఈ 15,660 గౌరవ ప్రదమైన ఇండ్లను 70 వేల మందికి అందించనున్నారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లను పనుల పురోగతిని మంత్రి తెలుసుకున్నారు.మంత్రి వెంట GHMC కమిషన్ జనార్ధన్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.కాగా మొత్తం 124 ఎకరాల స్థలంలో 1354 కోట్ల రూపాయలతో 15 వేల 660 ఇళ్లు నిర్మిస్తోంది బల్దియా.
Inspected country’s largest Dignity housing (2BHK) project/township done by GHMC at Kollur progressing briskly at Kollur in Sangareddy district
125 acres, 15,660 units, 9 million plus SFT built up space. Will house nearly 75,000 people when completed#DignityHousing#Telangana pic.twitter.com/6e6Isa743o
— KTR (@KTRTRS) August 11, 2018