30 ఏళ్లుగా టీవీ, సినిమా రంగంలో ఎన్నో చిత్రాల్లో, సీరియల్స్లో నటించిన ప్రముఖ బుల్లితెర నటుడు, వ్యాఖ్యాత 1969లోనూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఖమ్మం జిల్లాకు చెందిన జేఎల్ శ్రీనివాస్ తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు జంజిరాల రాజేష్తో కలిసి శ్రీనివాస్ మాట్లాడారు.
టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, వాటికి ఆకర్షితుడినై తాను పార్టీలో చేరుతున్నానన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో తమ బృందంతో ప్రచారం చేస్తుందన్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. 60 ఏళ్లలో చేయలేని పనులను టీఆర్ఎస్ పార్టీ గడిచిన కొద్ది రోజుల్లో చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.