నిరుద్యోగి ఆత్మహత్య…….విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేదని ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన దుర్గారావు బీటెక్ చదువుకున్నాడు.ఉద్యోగ సాధన కోసం ఎక్కడికి వెళ్లిన పోటీ ఉండడం, ఎంత ప్రయత్నించిన ఉద్యోగం రాకపోవడంతో గత కొన్ని రోజులుగా మానసికంగా కుంగిపోతున్నాడు.తీవ్ర మనస్తాపనికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని స్తానికులు ఆస్పత్రిలో చేర్పించగా కోలుకోలేక మృతిచెందాడు.
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడం, ప్రైవేట్ జాబ్స్ దొరకకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఘననీయంగా పెరిపోయింది. ఉపాధి కల్పనలో ప్రభుత్వం విఫలం చెందడంతో చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడి తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.ఓట్లు కోసం హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తీసి నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబుకు గుణపాటం చెప్పాలి.