నిజామాబాద్ ఎంపీ కవిత, త్వరలొ జిల్లాలో జరిగే కేసీఆర్ బహిరంగ సభ ద్వారా ప్రభంజనం సృష్టిస్తామనీ, వచ్చే ఎన్నికల్లో విజయం మాదే అని తెలిపారు. శుక్రవారం ఆమె పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిందే టీడీపీ, అలాంటిది ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవటం అనైతికమని అన్నారు.
కాంగ్రెస్, టీడీపీల పొత్తును ఆ పార్టీల నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారనీ, ఇక ప్రజలెలా ఆమోదిస్తారని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్లు సిద్ధాంతాలు పక్కన పెట్టేశాయని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తును ప్రజలు తిరస్కరిస్తారని చెప్పారు. మరో వైపు రేవంత్రెడ్డి పై జరుగుతున్న ఐటీ దాడులకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని అన్నారు.