Home / ANDHRAPRADESH / జగన్ టీఆర్ఎస్ నేతలను కలవడం నిజంగా ఏపీకీ శాపమా?

జగన్ టీఆర్ఎస్ నేతలను కలవడం నిజంగా ఏపీకీ శాపమా?

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సీనియ‌ర్ ఎమ్మెల్యే కేటీఆర్, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మ‌ధ్య జ‌రిగిన స‌మావేశం దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌పై ర‌క‌ర‌క‌లా వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ భేటీపై స‌హ‌జంగానే టీడీపీ విరుచుకుప‌డుతోంది. అయితే, ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో ఓ మెసేజ్ వైర‌ల్ అవుతోంది. ఇదే ఆ మెసేజ్‌.

“జగన్ టీఆర్ఎస్ నేతలన కలవడం నిజంగా ఏపీకీ శాపమా…
భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా కేసీఆర్ తో జతకట్టడం ద్రోహమా?.
జాతీయ పార్టీలతో, పొరుగు రాష్ట్రాల పార్టీలతో కలిసి ఉండడం నేరమా
రాష్ట్ర అవసరాల కోసం ఇతర పార్టీలతో స్నేహభావంతో కలిగి ఉండడం తప్పా?
మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనే నానుడి
పది మందితోని మంచిగా ఉండి పనులు చేసుకోవాలనే ఆలోచన తప్పా
ఇన్ని రోజులు జాతీయ పార్టీతో అధికారాన్ని పంచుకున్న బాబు ఏం చేశారు?
ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తమ వైఫల్యాలను పక్కపార్టీల మీద నెట్టేయడమేనా
అసలే విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సింది ఆదరించే చేతులు
పార్టీలతో మంచిగా ఉండి రాష్ట్ర అవసరాలను నెరవేర్చుకోవాలి
రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం బాబు గారికి తప్పనిపించలేదు
విభజన హామీలు సాధించకుండా నాలుగున్నరేళ్లు అధికారాన్ని పంచుకోవడం తప్పనిపించలేదు
జగన్ మాత్రం ఏ పార్టీతో కలిసినా దానిని భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం
ఇప్పుడు కావాల్సింది ఎవరు ఎవరితో కలిశారన్నది ముఖ్యం కాదు
మన ఏపీకీ ఏం లాభం చేకూరుతుందనేదే ముఖ్యం
శతృత్వంతోనే సాధించలేనిది స్నేహభావంతో సాధించినవాడే గొప్ప
అందుకే 40 ఏళ్ల అనుభవం కాదు మనకు ఇప్పుడు కావాల్సింది
రాష్ట్ర అవసరాలను తీర్చే 40ఏళ్ల యువకుడు కావాలి.
జై జగన్“ అంటూ ఈ సందేశం చెలామ‌ణిలో ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat