వైసీపీ పార్టీలో కీలక నేతగా ఉన్నచిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ని చంపేందుకు ప్రస్తుత అధికార టీడీపీ నాయకులు చేసిన కుట్ర బట్టబయలైంది. చెవిరెడ్డిపై దాడి చేయాలని స్థానిక టీడీపీ నేత పులివర్తి నాని గత కొద్ది నెలలుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా చెవిరెడ్డికి సంబంధించిన ప్రతి కదలికను తెలిపేలా ఆయన దగ్గర ఇద్దరు డ్రైవర్లను నియమించారు. ఇవాళ తిరుపతిలో మీడియాతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ..టీడీపీ కుట్రను ఆధారాలతో బయటపెట్టారు. తన దగ్గర చేరిన ఇద్దరు డ్రైవర్లను పోలీసులకు అప్పగించారు.తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో ఎప్పుడూ లేనివిధంగా రెక్కీలు, హత్యలు లాంటి ప్లాన్లు వేసే సంస్కృతిని టీడీపీ నేతలు తీసుకొచ్చారని చెవిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు.నాకు తెలియకుండానే ఇద్దరు వ్యక్తుల్ని నా వాహనశ్రేణిలో ఒక వాహనంతో సహా డ్రైవర్ను పెట్టారని… ఈ సందర్భంగా రెక్కీ చేసిన డ్రైవర్, మరో వ్యక్తి మాట్లాడిన వీడియోను రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఇద్దరు డ్రైవర్లు మాట్లాడుతూ నిజాన్ని ఒప్పుకున్నారు. ‘పులివర్తి నాని మాకు చాలా బాగా తెలుసు. ఆయన పంపితేనే మేము నెలరోజుల కింద చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్న వద్ద డ్రైవర్లుగా చేరాం. ప్రతీ క్షణం ఎమ్మెల్యే కదలికలను గమనించి నానికి అందిచడమే మా పని. ఇలా చెప్పినందుకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాము అని వారు తెలిపారు.
