ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు అనంతపురం జిల్లాలో జరుగనున్న ఎన్నికల సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో రూపకల్పన చేసిన ఈ సమర శంఖారావం కార్యక్రమాల్లో ఆయన ఇప్పటికే రెండు ఈనెల 6న చిత్తూరు (తిరుపతి), 7న వైఎస్ఆర్ జిల్లాల్లో జరిగిన సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. నేడు అనంతపురం వేదికగా శంఖారావం లో పాల్గొననున్నారు. ఇప్పటికే అనంతపురం నగరానికి చేరుకున్న జగన్ శ్రీ7 కన్వెన్షన్ హాలులోవివిధ రంగాల్లో పనిచేస్తున్న తటస్థులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటలకు బెంగళూరు రోడ్డులో జిల్లా వైయస్ఆర్సీపీ పార్టీ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో ‘సమర శంఖారావం’ సభలో పాల్గొంటారు.
