ఎన్నికలు సమీపిస్తున్న వేల ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా కాపీ కొడుతున్నాడు.ఇప్పటికే పించన్లు, ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు తదితర కొన్ని హామీలను ఇప్పటికే కాపీ కొట్టి.. అసెంబ్లీలో ఆమోదించారు. ఇదిలావుండగా ఇక తాజాగా బాబు మరో పథకాన్ని జగన్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో నుంచి కాపీ కొట్టేశారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే.. రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం రైతుకు 12 వేల 500 రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి సంవత్సరం క్రితమే ప్రకటించారు. అయితే ఈ పథకాన్ని చంద్రబాబు ఇప్పుడు కాపీ కొట్టి.. ”అన్నదాత సుఖీభవ” పేరుతో ప్రకటించారు.ఈ పథకానికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కింద ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి 10వేల రూపాయలు ఇవ్వనున్నారు.
అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ..చంద్రబాబు ఇవ్వనున్నపది వేల రూపాయలలో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి రానుంది. ఇటీవల మోడీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంకింద ప్రతి సంవత్సరం ఆరు వేలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ పథకం లో భాగంగా సాధారణంగా ఒక్కో రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరువేల ఆర్థిక సాయం అందుతుంది. దానికి మరో నాలుగు వేలు కలిపి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది.ఇదికూడా విడుతల వారీగా ఇవ్వనుంది.