ఇవాళ సాయంత్రం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.“మా తాత రాజారెడ్డిని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు.. మానాన్న చనిపోయినప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి ముందురోజు చంద్రబాబు “అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా” అని తన తండ్రిని హెచ్చరించారని అన్నారు. వైజాగ్ లో తనపై కత్తిదాడి జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే అన్నారు. ఇపుడు వైఎస్ వివేకా హత్య కూడా చంద్రబాబు
ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. తమ కుటుంబానికి సంబంధించి ఏ సంఘటన చూసినా.. అందులో చంద్రబాబు నాయుడే కనిపిస్తున్నాడని అన్నారు. తన కుటుంబంపై చంద్రబాబు కక్ష కట్టారని… కుట్రపూరితంగా హత్యారాజకీయాలు చేస్తున్నారని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీబీఐ విచారణలోనే నిజాలు బయటకొస్తాయనీ.. చేసినవాళ్లు ఎంత పెద్దవాళ్లైనా బయటకు రావాలి.. శిక్ష పడాలి“ అని జగన్ డిమాండ్ చేశారు.
