తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న గద్వాల్ మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన షాక్ నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కోలుకోక ముందే.. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, గద్వాల్ మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ బీజేపీలో చేరనున్నారు.ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ డీకే అరుణను కలిశారు. రామ్ మాధవ్తో దాదాపు అరుణ 45 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం రామ్ మాధవ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడించినట్లు తెలుస్తోంది. రాజకీయ పరంగా ఆమె భవిష్యత్పై షా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇందుకోసం ఇప్పటికే ఆమె బీజేపీ అధిష్ఠానంతో చర్చించేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అరుణ బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ స్థానం డిమాండ్ చేస్తునట్లు సమాచారం..