ఈ నెల 11 న ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో భారీగా పోలింగ్ (84 %) నమోదు కావడంతో విజయంపై అన్ని పార్టీలు తమ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని ఇప్పటికే పలు జాతీయ సర్వేలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పనిచేసిన పలువురు మంత్రులకు ఓటమి తప్పదని పలువురు రాజకీయ విశేషకులు చర్చించుకుంటున్నారు. ఈ లిస్టులో మొదటి స్థానంలో
దేవినేని ఉమమహేశ్వరరావు ఉండగా రెండోవ స్థానంలో నారా లోకేశ్..
అచ్చం నాయుడు,
గంటా శ్రీనివాసరావు,
అయ్యన్న పాత్రుడు,
పరిటాల శ్రీరామ్ ( సునీత ),
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,
కాల్వ శ్రీనివాసులు,
అఖిల ప్రియ,
ఆదినారయణ రెడ్డి లు ఉన్నారు.