వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబు అండ్ టీం పై విరుచుకుపడ్డారు.ఇంతకీ ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక మంత్రిగా ఉన్నది యనమలా? కుటుంబరావా? యనమల డిజ్యూర్ అయితే, కుటుంబ రావు సామాజిక కారణాల వల్ల ఢిఫ్యాక్టో అయ్యాడా? ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్ బ్రోకర్ చేతిలో పెట్టారా? అంటూ ప్రశ్నల జల్లు కురిపించారు.
రాష్ట్రంలో అప్పుల గురించి తాను చెప్పిన సమాచారం ముమ్మాటికి నిజమేనని.చంద్రబాబు, బ్రోకరు కలిసి మన రాష్ట్ర ప్రజలను ముంచేశారని చెప్పుకొచ్చారు. ఫైనాన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్స్ రెండింటిలోను దొంగ లెక్కల నిపుణుడిని పెట్టి అప్పుగా తెచ్చిన లక్షల కోట్లు దోచేశారని మండిపడ్డారు.వచ్చేవన్ని మంచిరోజులే త్వరలో విచారణ ప్రారంభం కాగానే బ్రోకరు గారు… “నాకేం సంబంధం” అంటూ పారిపోవడం ఖాయం! అప్పుడు ఎవరు ఎలాంటి మోసం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికి తెలుస్తుందని చెప్పారు.