ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయితే దానికి ఆత్మహత్యే పరిష్కారం కాదని..ఎవరు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇంటర్మీడియట్ విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కోరారు.సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన తడ్కపల్లి అజయ్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేసుకుని సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు వెంటనే స్పందించి.. ఆసుపత్రి డైరెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు..అదే విధంగా పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గారు విద్యాశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు కమిటీ వేయడం జరిగిందన్నారు.
తప్పకుండా రివాల్యువేషన్ ద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు. ఎవరు కూడా ఆందోళన చెందొద్దని.. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్యే పరిష్కారం కాదని., పరీక్షలో ఫెయిలైతే..
జీవితంలో ఫెయిలైనట్లు కాదని.., ప్రాణాలు పోతే తిరిగిరావంటూ.. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దని ఈ సందర్భంగా పిలుపునిచ్చి విద్యార్థుల్లో , తల్లిదండ్రుల్లో మరో సారి మనోధైర్యాన్ని నింపారు..