ప్రజల తీర్పే శిరోధార్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,నవీన్ పట్నాయక్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించిన ఈసీకి అభినందనలు తెలిపారు. తెలంగాణలో ప్రజలు టీఆర్ఎస్కు మెజార్టీని కట్టబెట్టారని చెప్పారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారని చెప్పారు. టీఆర్ఎస్కు 9,ఎంఐఎం ఒక స్ధానంలో గెలిచిందన్నారు. కాంగ్రెస్,బీజేపీ ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో గెలుపు,ఓటములు సహజం అన్నారు. తెలంగాణ ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తామన్నారు. ప్రజల తీర్పు ఎందుకు భిన్నంగా వచ్చిందో పార్టీలో చర్చిస్తామన్నారు. . ప్రజాస్వామ్యంలో ప్రజలే బాస్లు అని చెప్పిన కేటీఆర్ టీఆర్ఎస్కు మెజార్టీని కట్టబెట్టారని తెలిపారు.
