‘ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమిస్తాంమని సీఎం జగన్ అన్నారు. ఆగస్టు 15 వచ్చే సరికి అక్షరాలా గ్రామాల్లోని యువతకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు రూ. 5 వేల జీతాలతో గ్రామ వాలంటీర్లను నియమిస్తామన్నారు. వ్యవస్థల్లో లంచాలు లేకుండా చేసేందుకే వీరి నియామకం ఉంటుందన్నారు.. సేవా దృక్పథం ఉన్న పిల్లలకు వేరే చోట ఉద్యోగం వచ్చేదాకా గ్రామ వాలంటీర్లుగా పని చేయవచ్చుని, ప్రభుత్వ పథకాలు ఎవరికీ అందకపోయినా పొరపాటునైనా లంచాలు తీసుకుంటున్నారని తెలిసినా, వివక్ష కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేయవచ్చన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, విప్లవాత్మక, పారదర్శక పాలనకు నాంది పలుకుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు
