ప్రస్తుత ఫలితాలతో దిగులుపడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేతలకు సూచించారు.పవన్ కళ్యాణ్ చెప్పి కనీసం రెండు రోజులు గడవకుండానే ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.జనసేన పార్టీ నేత రావేల కిషోర్ బాబు రాజీనామా చేసాడు.ఈ మేరకు లేఖ రాసి పార్టీ అధక్షుడు పవన్ కు పంపగా..ఆ లేఖలో కొన్ని వ్యక్తిగత కారణాలు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నానని అందులో పెర్కున్నారు.మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కిషోర్ బాబు జనసేన పార్టీ నుండి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి పోటీ చేయగా..వైసీపీ అభ్యర్ధి మేకతోటి సుచరిత చేతిలో దారుణంగా ఓడిపోయాడు.అంతకముందు రావేల ఐఆర్ఎస్ అధికారి.
2014 టీడీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించి మంత్రిగా చేసారు.పార్టీలో కొన్ని విబేధాలు వల్ల కావొచ్చు ఇంకేదైనా సమస్య కావొచ్చు కేబినెట్ విస్తరణ సందర్భంగా రావేల మంత్రి పదవి తొలగించడం జరిగింది.ఆ తరువాత టీడీపీ కి దూరంగా ఉన్నారు.అనంతరం 2019లో జనసేన పార్టీలో చేరాడు.ప్రస్తుతం ఇప్పుడు ఆయన బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఆ పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది.