ఇకనుంచి ఏపీలో రేషన్ బియ్యంకోసం చౌక ధరల దుకాణాలకి వెళ్లాల్సిన అవసరం లేదు.. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం ఇకనుంచి మీఇంటికే డోర్ డెలివరీ చేయబేతోంది. ప్రభుత్వం కొత్తగా రిక్రూట్ చేసుకోనున్న గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీనుంచి ఈ కార్యక్రమం పట్టాలెక్కనుంది. బియ్యాన్ని అత్యంత నాణ్యతతో కూడిన ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 5, 10, 15 కిలోల బియ్యం సంచులను సెప్టెంబర్ 1నుంచి నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు. బియ్యం, కందిపప్పు, పంచదారతోపాటు మరో రెండు లేదా మూడు నిత్యావసర సరుకులను గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలని సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వీటిని సక్రమంగా అమలు చేయాలని జగన్ ఆదేశించారు.
