గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.టీడీపీ సీనియర్ నాయకులు, మంత్రులు సైతం ఓడిపోయారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ప్లేట్ తిప్పేసిన విషయం అందరికి తెలిసిందే.ఆ పార్టీలో ఉన్న హేమాహేమీలు సైతం గెలిచిన తరువాత తన సొంత నియోజకవర్గానికి కూడా పనులు చేసుకోలేకపోయారు.పనులు చేస్తామని వేల కోట్లు మంజూరు చేసుకొని వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు తప్ప ప్రజలకు మాత్రం ఏమీ చెయ్యలేదు. ఈ నాయకులకు చంద్రబాబు బుద్ధి చెప్పాల్సింది పోయి,వాళ్లకి వత్తాసు పలికారు తప్ప వారిపై చర్యలు తీసుకోలేదు.
ఇక తూర్పుగోదావరి విషయానికి వస్తే జిల్లా పరిషత్ పదవీకాలం మరో రెండు రోజుల్లో ముగియనుంది.అయితే పదవిలో ఉన్నంతసేపు ఏదైనా చేసారా అని ఒక్కసారి వెనక్కి చుస్కుంటే అంతా శూన్యమే అని చెప్పాలి. నవీన్ కుమార్ ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నారు. ఈయన ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తనయుడు.జగన్ ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది,అలాంటి వ్యక్తి డబ్బులకు ఆశపడి టీడీపీ లోకి వెళ్ళిపోయాడు. ఈ మేరకు బాబు తన కొడుకికి ఈ పదవీ కట్టబెట్టారు. రెండేళ్ళు పదవిలో ఉన్న నవీన్ కుమార్ ఆశించిన రీతిలో పని చేయకపోవడమే కాకుండా ఉన్న నిధులను మొత్తం ఖాళీ చేసారు.
ఇక అసలు విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జెడ్పీ స్థలంలో ఉన్న స్త్రీ,శిశు సంక్షేమ శాఖ భవనాన్ని తమ అవసరాల కోసమని ఖాళీ చేయించి, కూల్చేచారు.ప్రభుత్వ కార్యాలయం ఉన్న స్థలాన్ని పైలాన్ కోసం వినియోగించగా, ఖాళీగా ఉన్న స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి అప్పగించేశారు.సాధారణంగా జిల్లాకు మేలు చేసిన ఏ జెడ్పీ చైర్మన్ కైనా మంచి గౌరవరం ఇస్తారు.అలాంటిది పార్టీ ఫిరాయించి చైర్మన్ పదవి పొందిన జ్యోతుల నవీన్కుమార్ పేరును ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్కు పెట్టడం విమర్శలకు గురవుతోంది.