Home / POLITICS / ఉన్నత విద్యాప్రమాణాలు పెంచాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం..!!

ఉన్నత విద్యాప్రమాణాలు పెంచాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం..!!

ఉన్నత విద్యాప్రమాణాలు పెంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. సుమారు 15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన సికింద్రాబాద్ పీజీ కళాశాల భవనాన్ని ఇవాళ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.త్వరలోనే ప్రత్యేకంగా విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నతవిద్య ప్రమాణాలు బాగున్నాయో ఆ తరహాలో ఇక్కడ అమలు జరుపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఉందన్నారు. తద్వారా ఇక్కడి విద్యార్థులు వ్యయప్రయాసలకోర్చి అంత దూరం పోకుండా నిలువరించవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇప్పటికే సాంకేతిక విద్యలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat