Home / SLIDER / తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్

తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్

జీవితం అంతా కూడా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. ఆచార్య జయశంకర్ గారి 85వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళ్ళు అర్పించారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయన టి ఆర్ ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ గారికి కి చేదోడువాదోడుగా ఉంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం లో సూచనలు, సలహాలు అందించారన్నారు…
 
ఆయన మన మధ్య లేకున్నా ఆయన పోరాటం పటిమ ,ఆయన తపన రాష్ట్ర సాధనలో అయన కృషి ఎవరు మర్చిపోలేరని చెప్పారు.. జీవితం అంతా కూడా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు…2009 డిసెంబర్ 9న అర్ధరాత్రి వచ్చిన ప్రకటన జయశంకర్ స్వయంగా రాసి కేంద్ర హోంశాఖ కు పంపిస్తే ఆనాడు కేంద్రము ప్రకటన చేసిందన్నారు….ప్రధాన మంత్రులకు, రాష్ట్రపతి లకు వినతిపత్రం ఇవ్వాలన్న శ్రీ కృష్ణ కమిటీకి తెలంగాణ ఎందుకు ఇవ్వాలో చెప్పాలన్న ప్రతి అంశంలో జయశంకర్ సార్ ఉన్నాడు అని తెలిపారు…
 
విద్యావంతులను,మేధావులను, ఉపాధ్యాయులను చైతన్య పరుస్తూ రాష్ట్రం కు జరుగుతున్న వివక్షను,రాష్ట్రం ఎందుకు అనే ఆవశ్యకతను వివరించారు వారు జయశంకర్ గారు అని.. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నామని… ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడలన్నపుడు తెలంగాణ కి జరుగుతున్న అన్యాయాన్ని ఆయన దగ్గర నేర్చుకొని అసెంబ్లీలో బల్ల గుద్ది వాదించి చర్చించామని, ఆయన ఇప్పుడు లేకపోవడం , చివరి దశలో క్యాన్సర్ తో మరణించడం చాలా బాధాకరమని చెప్పారు.. ఆయన జీవం మన మధ్యలో లేకపోయిన్నప్పటికి ఆయన మన గుండెల్లో చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారని…వారి ఆశయాలని కోసాగిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat