కృష్ణ నది వరద పోటెత్తి ఆల్మెట్టి,నారాయణ పూర్ ప్రాజెక్టుల నుండి వచ్చే వరద వల్ల జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన నారాయణ పెట్ జిల్లాలోని కృష్ణ మండలంలోని హిందూపూర్ గ్రామం వరద ముంపు కు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి,ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరావు పాల్గొన్నారు.
కృష్ణ నది వరద ముంపునకు గురైన నారాయణ్ పేట్ జిల్లా కృష్ణ మండలం లోని పలు గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సురక్షిత ప్రదేశాలకు NDRF బృందాలు, జిల్లా సిబ్బంది సహకారంతో తరలించటము జరిగిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వరద ముంపు గ్రామాల ప్రజలకు తాత్కాలిక షెల్టర్లు ను ఏర్పాటు చేసి వారిని ప్రభుత్వం తరుపున ఆదుకుంటామన్నారు మంత్రి. వారికి నిత్యవసర వస్తువుల్ని అందజేసి పునరావాస చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు ను ఆదేశించారు.
Post Views: 283