యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. రెండువారాల్లో వరల్డ్ వైడ్ 424కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. సినిమా రిలీజ్ అయిన మొదటిరోజే నెగటివ్ టాక్ రావడంతో ఇక అందరు నిర్మాతల పని అయిపోయినట్టే అనుకున్నారు. కాని సినిమా ఎలా ఉన్నప్పటికే కలెక్షన్లు విషయంలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. దీంతో నిర్మాతలు పంట పండినట్టే అని అందరు భావిస్తున్నారు.
