ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. దీంతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తమదే గెలుపు అని అంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ” టీపీసీసీ అధ్యక్షుడు,ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మానసిక స్థితిపై నాకు అనుమానం వచ్చింది. నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు లేవు. పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని అంటున్న వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవంలేదు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తన సతీమణి ఓడిపోతుందనే ముందే తెల్సి ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డితో చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరును అభ్యర్థిగా ప్రకటించేశాడు. ఎవరు ఎన్ని చేసిన కానీ హుజూర్ నగర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పలు పథకాల వలన తమ పార్టీకే పట్టం కట్టి.. తమ అభ్యర్థినే గెలిపిస్తారని”ఆయన ధీమా వ్యక్తం చేశారు.