కమెడీయన్స్ ఎంత మంది వచ్చినా.. ఎంత మంది పోయినా…వేణు మాధవ్ కామెడీకి ఉన్న గుర్తింపు ఆదరణ వేరు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వుకునే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, సీన్ లో నటించే తీరు అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది. అలాంటి వేణు మాధవ్ బుధవారం రోజు అందరిని ఏడిపిస్తూ… అందని లోకాలకు వెళ్లిపోయారు. గత కొద్దికాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న వేణును.. కొంత మంది ప్రముఖులు కలిశారు. కానీ అప్పుడు ఎలాంటి పోటోలు బయటకి రాలేదు. కానీ వేణు మాధవ్ చనిపోవటంతో..హీరో రాజశేఖర్ గతంలో తాను వేణుతో తీసుకున్న ఫోటోను బయటపెట్టారు. నిజానికి వేణు మాధవ్ గుర్తుపట్టని స్ధితిలో ఉండిపోయారు.
