తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు ఈ రోజు శనివారం నుంచి సమ్మెకు దిగిన సంగతి విదితమే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడే బస్సులు ఆయా డిపోలకు పరిమితమైపోయాయి. అయితే పండుగ సీజన్లో ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ చర్యలను తీసుకుంది.మరోవైపు సమ్మెకు దిగిన కార్మికులపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల్లోపు ఆయా డిపోల దగ్గర రిపోర్టు చేసిన వారినే ఉద్యోగులను పరిగణిస్తామని.. అలా చేయకుంటే వార్ని విధుల నుంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు.
