సైరా సినిమా సక్సెస్ తరువాత చిరంజీవి తన భార్యతో కలిసి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. వీరి కలయిక పట్ల మీడియా చాలా ఆసక్తిగా ఎదురు చూసింది. రకరకాల వార్తలు కూడా షిరాకు చేశాయి. అయితే మొదటి రామ్ చరణ్ తో కలిసి వెళ్లాలనుకున్న చిరు భార్యతో కలిసి వెళ్లారు. అయితే చిరు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మీడియాతో పంచుకున్నారు.
నేను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరింది ఏంటంటే.. రాయలసీమకు సంబంధించిన ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడి చరిత్రపై రామ్చరణ్ ‘సైరా’ సినిమా తీశాడు. దానిని మీరు తప్పకుండా చూడాలి అని అడిగినట్టుగా చెప్పారు. దీనికి వైఎస్ జగన్ త్వరలోనే ‘సైరా’ సినిమా చూస్తానని చెప్పినట్టుగా తెలిపారు.
ఎంతో ప్రేమతో, సోదర వాత్సల్యంతో వైఎస్ భారతి మమ్మల్ని ఆహ్వానించారన్నారు. కుటుంబ సభ్యుల మధ్య గడిపిన అనుభూతి కలిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్ భారతికి ప్రత్యేకించి అభినందనలు తెలిపారు చిరంజీవి