హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బాగంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 35,34 బూత్ రామపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి..ఘన స్వాగతం పలికిన మహిళలు,మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ..గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా వారు అభ్యర్దించారు..
-గడప గడపన వారికి ఘన స్వాగతం లబించింది..టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు బాగున్నాయని,టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తామని ప్రజలు వారితో అన్నారు..టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయని,సైదిరెడ్డిని గెలిపించుకుని నియోజకవర్గాని అభివృద్ది చేసుకుందామని కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ ను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు..
-టీఆర్ఎస్ విజయం ఖాయమైపోయిందని,మంచి మెజారిటీతో టీఆర్ఎస్ గెలవనుందన్నారు..అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ కు బాసటగా నిలిచి హుజుర్ నగర్ ను గెలిచి బహుమానంగా ఇవ్వనున్నారన్నారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.ఆయన నియోజకవర్గానికి చేసిందేం లేదన్నారు.ఉత్తమ్ కి ఓటేస్తే ఓటు వృదా అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యనాయకులు,ఇంచార్జ్ లు,కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు..
Post Views: 280