బిగ్ బాస్ లో ఈ వారం ఇంటి నుండి ఒకరు బయటకి వెళ్లనున్నార. ప్రస్తుతం నామినేషన్లో శ్రీముఖి, శివజ్యోతి, అలీ, వరుణ్ సందేశ్ ఉన్నారు. ఇప్పటికే రాహుల్ టిక్కెట్ టూ ఫినాలేకి వెళ్ళగా, నిన్న రాత్రి బాబా భాస్కర్ టిక్కెట్ టూ ఫినాలే ఛాన్స్ దక్కించుకున్నారని బిగ్ బాస్ తెలిపారు . అయితే ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతూ వస్తుండగా, ఈ ఆదివారం దీపావళి కావడంతో నేడు ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందని చెబుతున్నారు. రీ ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా ఈ వారం ఇంటి నుండి బయటకి వెళతాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందుకు కారణం బయట పరిస్థితులు అన్నీ చూసి వచ్చి గేమ్ ఆడడం, గతంలో జోష్ ఇప్పుడు లేకపోవడం వలన అలీకి తక్కువ ఓట్స్ పడ్డాయని చెబుతున్నారు.
