Home / ANDHRAPRADESH / జగన్ మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..!

జగన్ మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..!

గతంలో పాదయాత్రలో నేను విన్నాను నేను ఉన్నాను అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం… వారు మోసపోయిన మొత్తాలను ఇవాళ్టి నుంచి చెల్లించనుంది. గత పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు… బడ్జెట్‌లో రూ.1150కోట్లు కేటాయించారు. ఇందులో రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ… గత నెల 18న ఉత్తర్వులు కూడా జారీచేశారు. దీంతో మొత్తం 3 లక్షల 69 వేల 655 మంది బాధితులకు ఊరట కలగనుంది.

గుంటూరులోని పోలీస్‌ పెరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి… స్వయంగా చెక్కులు పంపిణీ చేసారు. అలాగే ఇతర జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారు. తర్వాతి దశలో రూ.20 వేలలోపు మరో 4లక్షల మంది డిపాజిట్‌ దారులకు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగేడిస్ట్రిక్ట్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ ప్రతిపాదనల ప్రకారం… జిల్లాల వారీగా బాధితులకు సొమ్ము అందచేయనున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 19 వేల మంది వరకూ అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నారు.  ఆన్​లైన్ చెల్లింపులకు సంబంధించిన వెబ్​సైట్‌ను సీఎం ప్రారంభిస్తారు.జగన్ గుంటూరు పర్యటన కోసం… ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వెయ్యిమంది పోలీసు సిబ్బందితో అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat