కడప జిల్లా గోకవరం మండలం ఎస్ రామాపురం లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఠాగూర్ సినిమా లో హీరో ఎవరు లంచం తీసుకున్నా వారి భరతం పడుతుంటాడు. ఆగటం అల్ తో బెంబేలెత్తిన లంచగొండి అధికారులు ఎట్టిపరిస్థితుల్లోను లంచం తీసుకోకూడదు అని ఒక మాట మీదకు వస్తారు. దాదాపుగా అలాంటి సీన్లు రిపీట్ అవుతున్నాయి ఏపీ ప్రజల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. కడప జిల్లా రామాపురం లో లంచం అడిగిన పంచాయతీ సెక్రెటరీ కి ప్రజలు చుక్కలు చూపించారు. లంచం అడిగారు కదా తీసుకో తీసుకుని సంతకం పెట్టు అంటూ సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి మరి సదరు అధికారిని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎవరు లంచం తీసుకున్న వెంటనే ఫోన్ చేయాలని అవినీతి నిరోధానికి టోల్ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. సదరు పంచాయతీ సెక్రెటరీ సంతకం కోసం 2000 డిమాండ్ చేయడంతో అక్కడి ప్రజలు 2000 తీసుకో జగన్ సార్ కి ఫోన్ చేసి చెప్తాను అంటూ మాట్లాడడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
