స్వాతి మొదట్లో యాంకర్ గా బుల్లితెరపై తానేంటో నిరూపించుకుని ..కలర్ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకుల మదిని దోచుకున్న అచ్చమైన తెలుగు అమ్మాయి.. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీచ్చి..వరుస సినిమాలతో..వరుస హిట్లతో ఇండస్ట్రీలో తన సత్తా నిరూపించుకున్న నేచూరల్ బ్యూటీ.
తాజాగా ఈ బ్యూటీ మరోసారి గతంలో కార్తికేయ మూవీలో కలిసి నటించిన యువహీరో నిఖిల్ తో రోమాన్స్ చేయడానికి సిద్ధమైంది.నిఖిల్ హీరోగా త్వరలో తెరకెక్కనున్న కార్తికేయ-2లో స్వాతికి అవకాశం వచ్చినట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో స్వాతి ఏ పాత్రలో నటించనున్నది అనే విషయం తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఈ బ్యూటీ మళయాలంలో త్రిస్సూర్ పూరం అనే చిత్రంలో నటిస్తుంది.స్వాతి గత రెండేళ్ల కిందట వచ్చిన లండన్ బాబులు చిత్రంలో నటించింది..