ఇటీవల గత కొంతకాలంగా అందాలను ఆరబోయకుండా కేవలం ఛాలెంజింగ్ రోల్స్కు ప్రాముఖ్యతనిస్తున్నది చెన్నై సొగసరి రెజీనా. ‘ఎవరు’ సినిమాలో ప్రతినాయికఛాయలున్న పాత్రలో నటించి వైవిధ్యతను చాటుకున్నది.
త్వరలో జ్యోతిష్యురాలిగా రెజీనా సరికొత్త అవతారం ఎత్తబోతున్నది. వివరాల్లోకి వెళితే ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తిక్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో మహిళా ప్రధాన ఇతివృత్తంతో ఓ సినిమా తెరకెక్కనున్నది.
హారర్ థ్రిల్లర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో రెజీనా జ్యోతిష్యురాలిగా నటించనున్నది.త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు ..