తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇటు కార్పొరేషన్లలోనూ, అటు మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్విట్టర్ ద్వారా కేసీఆర్కు, కేటీఆర్కు అభినందనలు తెలియజేశారు.
ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్కూ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అభినందనలు.
ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో టీఆర్ఎస్కు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టీఆర్ఎస్కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలు.’’ అంటూ హరీశ్రావు ట్వీట్ చేశారు.