తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఫింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు.
అయితే తాజాగా పవన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా గతంలో తనకు బంఫర్ హిట్ నిచ్చిన హారీష్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం.
హారీష్ శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నది. ఇదే అంశం గురించి మైత్రీ మూవీ మేకర్స్ యూనిట్ తమ సంస్థ అధికారక ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. పవన్ హారీష్ తో సినిమా చేయనుండటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం గురించి మరిన్నీ విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.