పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మీడియాపై తనదైన శైలిలో విరుచుకుపడింది. పవన్ కళ్యాణ్ తన పిల్లల కోసం ఒక బంగ్లా బహుమతిగా ఇచ్చినట్టు ప్రస్తుతం ఎన్నో పుకార్లు వస్తున్నాయి. అంతేకాకుండా దాని విలువ సుమారు 5కోట్లు ఉంటుందని అంటున్నారు. ఈ పుకార్లు ఎలాగైతేనో ఆమె దగ్గరకి చేరాయి. దాంతో వెంటనే ఆమె ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇప్పుడు ఇంత అర్జెంట్ గా ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉందని..నిన్నటి నుండి అందరూ ఫోన్లు చేసి ఆడుతున్నారని దాంతో ఇది పెద్ద రాధాంతం అయ్యింది అర్ధమయింది అని అన్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ పుకారుపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. నేను ఇప్పటివరకు మా తండ్రి దగ్గర కూడా ఒక్క రూపాయి తీసుకోలేదని ప్రతీది నేను కష్టపడి సంపాదించాను. ఆ డబ్బుతోనే ఫ్లాట్ తీసుకున్నాను. అంతేగాని నా మాజీ భర్త ఇవ్వలేదని. ఆయన దగ్గరనుండి ఏమీ ఆశించలేదని అన్నారు. నాకు తెలిసి ఈ పుకారుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఈ విషయం ఇంకా ఆయన వరకు వెళ్లి ఉండదని అన్నారు. ఇలాంటి వార్తలతో మా మనోభావాలు దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
