తెలంగాణలోవెయిటింగ్లో ఉన్న 4 గురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అనితా రాజేంద్ర, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా విజయేంద్ర, రవాణ శాఖ కమిషనర్గా ఎం. ఆర్. ఎం రావు, అటవీశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎం. ప్రశాంతిని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది.
అలాగే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్ రాస్కు గనులు భూగర్భ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది.ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ అదనపు బాధ్యతల నుంచి సునీల్ శర్మను, గనులు, భూగర్భ శాఖ అదనపు బాధ్యతల నుంచి జయేష్ రంజన్ ను ప్రభుత్వం రిలీవ్ చేసింది.