ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికల ఫలితాల ఉత్కంఠ వీడింది. అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు నలుగురు విజయం సాదించారు. ఒక్కొక్కరికి 38 తొలి ప్రాదాన్యత ఓట్లు వచ్చాయి. కాగా టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్య కు 17ఓట్లు మాత్రమే వచ్చాయి.
వారి ఓట్లు నాలుగు చెల్లలేదు. ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పొరపాటు కారణంగా చెల్లలేదని సమాచారం వచ్చింది. అయోద్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని లు గెలుపొందారు.
కాగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసిపి కి మద్దతు ఇచ్చారని సమాచారం. కాగా కొత్తగా నలుగురు ఎంపీలు ఎన్నికవడంతో వైసీపీకి రాజ్యసభ లో బలం ఆరుకు పెరిగింది. సాదారణంగా ఐదుగురు మించితే రాజ్యసభలో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది.