ఏపీలోని తాజా కరోనా తీరు, వైద్య పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష చేశారు. కరోనా సెంటర్లలో నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం.
సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలన్నారు. కరోనా రోగులకు అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు.
ANM, ఆశావర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరా తీయాలన్నారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించేలా ప్రచారం చేయాలని.. ప్రభుత్వం అండగా ఉంటుందన్న ధైర్యం ప్రజలకు కల్పించాలన్నారు.